నవతరం రాజకీయ వ్యవస్థ నిర్మాణమే ధ్యేయంగా ఏర్పడిన జనసేన పార్టీ పాలకుల్లో జవాబుదారీతనం పెంచడంతో పాటు సమ సమాజ నిర్మాణం, యువతరానికి పాతికేళ్ల భవిష్యత్తు అందించే దిశగా మరింత బలంగా రాజకీయాలు నడిపేందుకు వీలుగా కొన్ని ముఖ్యమైన కమిటీలను పార్టీ అధినేత రూపొందించారు.. కమిటీల ఏర్పాటుకు సంబంధించి గత కొద్ది రోజులుగా సీనియర్ నాయకులతో విస్తృతంగా చర్చించి., తీవ్రమైన కసరత్తులు నిర్వహించినట్టు పార్టీ ఒక ప్రకటనతో తెలిపింది.. ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లాల వారీ సమీక్ష సమావేశాలు నిర్వహించిన అనంతరం క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన సమాచారాన్ని అధ్యయనం చేసి, విశ్లేషించి ఈ కమిటీలకు రూపకల్పన చేసినట్టు పార్టీ తెలిపింది.. వర్తమాన రాజకీయాలు, ప్రజా సంక్షేమం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పార్టీ భవిష్యత్ వ్యూహాలను రచిస్తున్నట్టు వెల్లడించింది.. యువత భవిష్యత్తుని తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు పార్టీ పేర్కొంది.. రాష్ట్రంలో బాధ్యతాయుతమైన రాజకీయాలను నెరపుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలన్న దృఢ సంకల్పంతో పార్టీ అధినేత పవన్కళ్యాణ్ ప్రణాళికలను తయారు చేస్తున్నట్టు తెలిపారు.. అన్ని పార్లమెంట్ స్థానాల పరిధిలో ధృడమైన పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని గ్రామ స్థాయి నుంచి పరిపుష్టం చేయాలనే కృత నిశ్చయంతో కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించింది.. వాడవాడలా జనసేన జెండా రెపరెపలాడేలా పార్టీ శ్రేణులను ఉత్తేజితం చేసేందుకు కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నట్టు జనసేన పార్టీ వెల్లడించింది.. ఈ కొత్త కమిటీలను విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించనున్నారు.. రేపు ప్రకటించబోయే కమిటీలలో పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పి.ఎ.సి.), లోకల్ బాడీ ఎలక్షన్స్ కమిటీ, కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) మోనిటరింగ్ కమిటీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి మోనిటరింగ్ వంటి ముఖ్యమైన కమిటీలు ఉండనున్నాయి.. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఏర్పడిన స్థబ్దతకు కమిటీల ఏర్పాటుతో తెరపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి..
816 views