తెలంగాణ శాసనసభకి ముందస్తు ఎన్నికల నేపధ్యంలో జనసేన అధినేత పవన్కళ్యాణ్ వ్యూహరచన మొదలు పెట్టారు.. ఆదివారం పార్టీ రాజకీయ వ్యవహారల కమిటీతో సుధీర్ఘంగా చర్చించారు.. హైదరాబాద్లోని మాదాపూర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.. తెలంగాణ ఎన్నికలే ప్రధాన అజెండాగా ఈ సమావేశం సాగింది.. ముఖ్యంగా సిపిఎం తెలంగాణ శాఖ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నాయకత్వంలో ఆ పార్టీ తెలంగాణ నేతలతో జరిపిన చర్చల వివరాలను పార్టీ అధినేతకి ప్యాక్ సభ్యులు వివరించారు.. ఆ చర్చలు సామరస్యంగా, ఫలవంతంగా జరగడంతో తదుపరి చర్చలు పవన్కళ్యాణ్ సమక్షంలో నిర్వహించాలని ప్యాక్ సభ్యులు కోరారు.. ప్యాక్ ప్రతిపాదనకి పవన్కళ్యాణ్ అంగీకారం తెలిపారు.. సిపిఎం నేతల్ని తదుపరి చర్చలకి ఆహ్వానించాలని రాజకీయ వ్యవహారాల కమిటీకి సూచించారు.. మంగళవారం లేదా బుధవారం సిపిఎం తెలంగాణ నేతలతో జనసేనాని సమావేశం జరిగే అవకాశం వుంది..
తెలంగాణలో రాజకీయ పార్టీల కొత్త పొత్తులు, ఎత్తుల నేపధ్యంలో రాజకీయ వ్యవహారాల కమిటీతో జనసేన అధినేత సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.. జనసేన అడుగులు ఎటువైపు, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది..? అన్న అంశాలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది..
Advertisement.